స్వాతంత్ర దినోత్సవ సంబరాల ఏర్పాట్లలో భాగంగా దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఉగ్రమూకల ఆగడాలు జరుగుతాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, మిలట్రీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. పంజాబ్ లోని పాటియాలాలో ఇలా ఓ ఏఎస్సై తనిఖీలు చేపట్టారు. అయితే ఓ కారు దగ్గరకు రాగానే అందులోని వ్యక్తులు ఏఎస్సై సుభాష్ సింగ్ ని ఢీకొట్టి మరీ వేగంగా ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో ఏఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. కారుని వెంబడిస్తూ ఆయన రోడ్డుపై పడిపోయారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
#Patiala: Car driver allegedly attempts to run over a cop who tried to stop him for routine checking for #IndependenceDay. pic.twitter.com/ZOftHe3TpS
— Nikhil Choudhary (@NikhilCh_) August 14, 2021