నెల్లూరు జిల్లా గూడూరు వద్ద జరిగిన ఒక రోడ్డుప్రమాదం భయానకంగా ఉంది.. ప్రమాదంలో కారు , లారీ ..ఢీ కొనడంతో , కారు అగ్గిపెట్టెలాగా తయారైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మాంసం ముద్దల్లా మారిపోయారు. మృతదేహాలను తీయాలంటేనే కష్టమైంది. కారు , లారీ ఢీ కొన్న ఈ ప్రమాదం చూసిన వారికి కాళ్ళు జలదరించాయి. రెండు వాహనాలు ఎంత వేగంగా ఉండకపోతే , ఇంత దారుణం జరుగుతుందో ఊహించండి. కారు తిరుపతి నుండి రాజమండ్రి కి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందినవారు.