ఆనందయ్య ఆయుర్వేదం మందుకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప, ఆనందయ్య ఇస్తున్న మందుల పంపిణీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కంట్లో వేసు మందుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, అందుకే దానిపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని చెప్పారు అధికారులు. ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గుతుందనడానికి రుజువులు లేవని, అందుకే ఆనందయ్య మందు వాడుతున్నా.. డాక్టర్లు ఇచ్చిన మందులు కూడా వాడాలని స్పష్టం చేశారు అధికారులు.