ఏపీలో కర్ఫ్యూని 10రోజులపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణల లాగే జూన్ 10వరకు ఏపీలో కూడా కర్ఫ్యూ పొడిగించారు. అయితే సడలింపు వేళల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ప్రకటించారు. ఈరోజుతో కర్ఫ్యూ గడువు ముగుస్తున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.