తమిళనాడులో కరోనాతో మరో సింహం మృతి చెందింది. ఈనెల 3న ఓ ఆడసింహం కరోనాతో మృతి చెందగా..ఇప్పుడు మరో సింహం అదే వైరస్ తో మృతి చెందడంతో ఆందోళన నెలకొంది. వండలూరు జూలో మొత్తం 11 సింహాలలో తొమ్మిదింటికి కరోనా సోకింది. వీటిలో నాలుగింటిలో డెల్టా వేరియంట్ బయటపడింది.
తొలిసారి ఓ సింహం మృతి చెందిన తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ జూని సందర్శించారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్పటికే కరోనా సోకిన సింహాల్లో స్వల్ప లక్షణాలున్నాయని అన్నిటి ఆరోగ్యం బాగుందని భావించారు. కానీ అనుకోకుండా 16వతేదీన పద్మనాధన్ అే 12ఏళ్ల సింహం మృతి చెందింది.
ఇక రష్యాలో జంతువులకు వేసే టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పెంపుడు జంతువులకు ఈ టీకాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీకాలకు ఇతర దేశాల్లో కూడా డిమాండ్ పెరిగింది.