మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు ఎలా ప్రవర్తిస్తారో చెప్పే ఉదాహరణ ఇది. ఇదెక్కడో విదేశాల్లో జరిగిన సంఘటన కాదు, తెలంగాణలోని కరీం నగర్లో జరిగింది. ఓ యువకుడు కరీంనగర్లో అర్ధనగ్నంగా వీరంగం సృష్టించాడు. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు ఉన్న సమయంలో గీతా భవన్ నుంచి బస్టాండుకు వెళ్లే మార్గంలో వచ్చిపోయే వాహనాలను ఆపేసి వాటిపైకి ఎక్కి హల్చల్ చేశాడు. యువకుడి చేష్టలకు రోడ్డుపై వెళుతున్న వారు వింతగా చూశారు. ఆ యువకుడి నుంచి తప్పించుకునేందుకు ఓ కారు యజమాని విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి స్థానికులు ఆ యువకుడిని చెట్టుకు కట్టేశారు. యువకుడిని వరంగల్ జిల్లాకు చెందిన రమేష్గా గుర్తించారు.