మాజీ మంత్రి, వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ తిరిగి మొదలైంది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృందం కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి చేరుకుంది. సుమారు 7 నెలల తర్వాత విచారణ తిరిగి ప్రారంభమైంది.
రెండేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసులో పలువురిని విచారించింది సీబీఐ. అయితే విచారణకు వచ్చిన అధికారుల్లో కొందరు కరోనా బారినపడ్డారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు నెలల తరువాత మళ్లీ విచారణ జరిపేందుకు అధికారులు వచ్చారు. ఇదివరకే ప్రశ్నించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన అధికారులు.. మరోసారి కేసులోని కీలక వ్యక్తులను విచారించబోతున్నారు.