మూడు రాజధానుల అంశంపై పుష్ప స్టైల్ లో తగ్గేదే లేదంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. పరిపాలనా వికేంద్రీకరణకే తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన ప్రధానమైంది. రాజ్యాంగం ప్రకారం, మూడు వ్యవస్థలు, అంటే న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు పనిచేస్తేనే గౌరవంగా ఉంటుందని, ప్రజాస్వామ్యం బతుకుతుందని, లేదంటే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని చెప్పారు.
మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి లేకపోవడం వలన వచ్చింది..
రెండో తెలంగాణ ఉద్యమం అభివృద్ధి అంతటినీ ఒకేచోట కేంద్రీకరించడం వలన వచ్చిందివికేంద్రీకరణ వల్ల ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని శివ రామకృష్ణన్ కమిటీ చెప్పింది
-సీఎం జగన్ గారు#APassembly pic.twitter.com/Oa0CjJos43
— 2024YSRCP (@2024YSRCP) March 24, 2022
తాము ఈ సూత్రాన్ని పూర్తిగా నమ్ముతున్నామని అన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయని చెప్పారు. గతంలో అసలు చట్టాన్నే వెనక్కు తీసుకున్నప్పుడు మళ్లీ ఆ చట్టంపై తీర్పు ఏంటని నిలదీశారు. చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉండదా అని ప్రశ్నించారు. నెల రోజుల్లో ఇన్ని కోట్లు ఖర్చు చేయండి అని కోర్టు చెప్పడం శాసన వ్యవస్థలోకి జోక్యం చేసుకోవడమేనని అన్నారు. అధికార వికేంద్రీకరణకే ముమ్మాటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
హై కోర్టు తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తిని, శాసన సభ అధికారాలను హరించేలా ఉంది
-సీఎం జగన్ గారు#APassembly pic.twitter.com/vGCwOSHOYR
— 2024YSRCP (@2024YSRCP) March 24, 2022
న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ నిర్ణయాలను ప్రశ్నించలేదని, కొన్ని పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ కూడా హద్దుమీరి ప్రవర్తిస్తోందనే అభిప్రాయం కలుగుతోందన్నారు. హైకోర్టు తీర్పు ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికే హానికరం అని అన్నారు. రాజధాని నిర్ణయంలో కేంద్రం పాత్ర కూడా ఉండదని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగానే తమ ప్రమేయం లేదని స్పష్టం చేసిందని జగన్ అన్నారు.
రాష్ట్ర రాజధాని అంశం కేంద్రం పరిథిలోనిది కాదని..
ఆర్టికల్ 3ని చూపిస్తూ కేంద్రం చెప్పింది.-సీఎం జగన్ గారు#APassembly pic.twitter.com/k0nbLYRs44
— 2024YSRCP (@2024YSRCP) March 24, 2022