సేమియా ప్యాకెట్లలో కరెన్సీ నోట్ల స్మగ్లింగ్..
చెన్నై ఎయిర్ పోర్ట్ లో సౌదీ కరెన్సీని సేమియా ప్యాకెట్లలో స్మగ్లింగ్ చేస్తూ ఓ మహిళ పట్టుబడింది. ఇప్పటి వరకూ అక్కడ, ఇక్కడ, ప్రైవేట్ పార్ట్స్ లో బంగారం, ఇతరత్రా వస్తువుల్ని స్మగ్లింగ్ చేసే వారిని చూసి ఉంటాం. ఇప్పుడు ఈ మహిళ ఎవరికీ అనుమానం రాకుండా సేమియా ప్యాకెట్లను ఎంచుకుంది.
సేమియా ప్యాకెట్లలో సౌదీ కరెన్సీ రియాద్ లను పెట్టి వాటి చుట్టూ సేమియాలను అందంగా కూర్చి.. ప్యాకింగ్ చేసింది. వాటిని ఇండియాకు అక్రమంగా తరలిస్తోంది. ఈ క్రమంలో పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మహిళను ఆపి చెక్ చేశారు అధికారులు. సేమియా ప్యాకెట్లలో సౌదీ కరెన్సీ చూసి షాకయ్యారు. ఇప్పటి వరకూ ఎవరూ ఇలా చేయలేదని, ఇదే తొలిసారి అని అంటున్నారు.