45 ఏళ్ళ ఓ మహిళ తనతో సహజీవనం చేస్తున్న 70 ఏళ్ళ వృద్ధుడిని చంపేసింది.. శరీరాన్ని ముక్కలు , ముక్కలుగా చేసింది.. కాళ్ళు , చేతులు , తల ..ఇలా అనేక భాగాలుగా చేసింది. ఒక చేతిని మూడురోజుల తరువాత ఇంటిముందు కుక్కలకు ఆహారంగా వేసింది.. ఇది చూసిన ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటి లోపలి చూసి షాక్ తిన్నారు.. కారణం ఏమిటో తెలుసా.. ? వృద్ధుడిని చంపేసిన ఆ మహిళ చుట్టూ తెగిపడిఉన్న శరీర భాగాలమధ్య , పడుకొని గాఢంగా నిద్రపోతొంది..
భరించరాని దుర్ఘంధంలో కూడా ఆమెకు నిద్ర ఎలా పట్టిందోకూడా అర్ధం కాని పరిస్థితి .. చివరకు మాస్కులతో లోపలికి పోయిన పోలీసులు , ఆమెను నిద్రలేపారు.. అప్పటికే వళ్ళు తెలియకుండా తాగి ఉంది.. ఆమెను అరెస్ట్ చేసి హాస్పిటల్ కి పంపారు.. పాకిస్తాన్ లోని కరాచీలో జరిగిన ఈ ఘటన తన సర్వీస్ లో ఇంతవరకు చూడలేదని పోలీసు అధికారి జుబెయిర్ నజీర్ అన్నారు. ఎంతగా అడుగుతున్నా , ఆమె చాలా కూల్ గా కనిపిస్తోందని చెప్పారు. మృతుడికి భార్యా పిల్లలు ఉన్నారని , ఈమె వద్దకు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడని పోలీసులు తెలిపారు.