తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన సైనికులలో ఒక్కొక్కరిదీ , ఒక్కో వీర గాథ.. కన్నీరు తెప్పించే మాటలు.. ప్రమాదంలో మరణించిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వివేక్ కుమార్ కి ఆరు నెలల కొడుకున్నాడు..బిడ్డపుట్టిన తరువాత చూసేందుకు వచ్చి , మొదటిసారిగా బిడ్డను చూసి , సైనిక సెల్యూట్ చేసాడు.. కొడుకు పెద్దయ్యాక , మిలిటరీలో నేరుగా కమాండర్ స్థాయి ఉద్యోగంలోకి రావాలని , అప్పుడు కూడా , మొదటి సెల్యూట్ తన బిడ్డకు తనదేకావాలని చెప్పేవాడట.. తన బిడ్డని పెద్దయ్యాక , మంచి స్థాయిలో ఉండే మిలిటరీ ఆఫీసర్ గా చూడాలన్నది తన కోరిక అని చెప్పేవాడట.. అలాంటి దేశభక్తుడైన సైనికుడిని కోల్పోవడం నిజంగా దురదృష్టమే.. అక్కడ ఆచారం ప్రకారం , వివేక్ కుమార్ భార్యను , చివరిసారిగా పెళ్లికూతురుగా అలంకరించి భర్త శవం వద్దకు తీసుకొస్తుంటే , అక్కడున్న అధికారులు కన్నీరుపెట్టారు..