పులికడుపున పులే పుడుతుంది.. కొంతమంది వీరుల కడుపున వీరులే పుడతారు.. ఆ రక్తం అలాంటిది.. తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన , హెలికాఫ్టర్ పైలెట్ వింగ్ కమాండర్ పృథ్వి చౌహన్ అంత్యక్రియలు ఆయన 12 ఏళ్ళ కూతురు ఆరాధ్య , నాలుగేళ్ళ కొడుకు పూర్తి చేశారు.
. అంత్యక్రియల సమయంలో , కొడుకు , తన తండ్రి వేసుకునే మిలిటరీ టోపీతో , తండ్రి మృతదేహానికి సెల్యూట్ చేసి , అక్కతో కలిసి చితికి నిప్పుఅంటించాడు.. చితివద్దనే ఇద్దరూ , తమ తండ్రి అడుగుజాడల్లో మిలిటరీలోనే చేరుతామని ప్రతిజ్ఞ చేశారు.
తన తండ్రి , దేశం కోసమే చనిపోయారని , తామూ అంతేనని అన్నారు. ఇద్దరం యుద్ధ విమానాల పైలెట్లు అవుతామని స్పష్టం చేశారు.. పిల్లలిద్దరి ప్రతిజ్ఞ అక్కడున్నవారికి కన్నీళ్లు తెప్పించింది.. వారి దేశభక్తికి ఉప్పొంగిపోయారు..