వీడెవడో నీచ ,నికృష్ట , భ్రష్టుడైన పూజారి..

    0
    1369

    వీడెవడో నీచ ,నికృష్ట , భ్రష్టుడైన పూజారి.. ఆంజనేయస్వామి ఆలయ పూజారిగా ఉంటూ , జారుడయ్యాడు.. జారుడంటే వ్యభిచారుడు అని.. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురిడి ఆంజనేయస్వామి ఆలయ పూజారి , కొంతమంది మహిళా భక్తులతో రాసలీలలు ఫొటోలు , వీడియోలతో సహా ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కొంతమంది పెళ్ళైన మహిళలు , పెళ్లికాని యువతులను , మాయమాటలతో లోబరుచుకుని , వాళ్ళతో రాసలీలలు సాగిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

    నంద్యాల జిల్లా, రంగాపురం గ్రామానికి చెందిన స్రవంతికి ,అనంతపురం జిల్లా మురిడి ఆలయ ప్రధాన అర్చకుడు అనంతసేనతో 2008లో వివాహం అయింది. వారికి కొడుకు, కుమార్తె ఉన్నారు. కాగా ఆలయానికి వచ్చిన కొందరు మహిళలు, యువతులతో రాసలీలలు కొనసాగిస్తున్న వీడియోలు, ఆడియోలు, ఫోటోలను అర్చకుడి భార్య బయటపెట్టింది. తనను ఏడేళ్లుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది.

    ఆలయానికి పూజల కోసం వచ్చే మహిళలు ,యువతులను , తప్పుడు మాటలు చెప్పి , మంత్రాలు , మాయలు , జాతకాలు అనిచెప్పి వశీకరణ చేసి, లైంగిక కోరికలు తీర్చుకుంటున్నట్లు అర్చకుడి భార్య ఆరోపించడం కలకలం రేపింది. అక్రమ సంబంధాలపై ప్రశ్నించినందుకు తనను ఎన్నోసార్లు దాడి చేసి.. పుట్టింటికి పంపినట్లు స్రవంతి వాపోయింది. అక్రమ సంబంధాల మోజులో పడి విడాకుల నోటీసులు కూడా పంపాడని ఆమె తెలిపింది.

    విడాకుల నోటీసులపై చర్చించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి మురిడి గ్రామానికి వెళ్లగా కిరాయి గూండాలతో దాడి చేయించారని ఆమె చెప్పింది. అంతేకాదు రాసలీలలకు అడ్డుపడుతున్నాననే నేపంతో తనను హతమార్చేందుకు కూడా భర్త కుట్రపన్నాడని స్రవంతి ఆరోపించింది. అర్చకుడి రాసలీలలను ఆధారాలతో సహా భార్య బయటపెట్టడంతో కేసు నమోదు చేశారు..

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.