మూడంటే మూడే నిముషాలు.. ఇక హెలికాఫ్టర్ కిందకు దిగుతుందని అనుకుంటున్న తరుణంలో గాల్లోనే పైలెట్లు ఇద్దరినీ మృత్యువు మింగేసింది.. ఛత్తీస్ ఘడ్ లోని రాయపూర్ ఎయిర్పోర్ట్ లో గత రాత్రి ప్రభుత్వ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో , హెలికాఫ్టర్ లోని ఇద్దరు పైలెట్లు చనిపోయారు.
ఈ హెలికాఫ్టర్ ప్రాక్టీస్ లో భాగంగా , రాత్రి ఎనిమిదిన్నరనుంచి గాల్లో ఎగురుతుంది . ఇక ట్రయల్స్ ముగిసిపోయాయి అనుకుంటున్న తరుణంలో హెలికాఫ్టర్ ల్యాండింగ్ కి సిద్ధమైంది. రాత్రి 9 గంటల 10 నిమిషాలకు లాండింగ్ కోసం దిగుతుంది.
మరో మూడు నిమిషాల్లో లాండింగ్ అవుతుంది అనుకుంటున్న సమయంలో కుప్పకూలిపోయింది. హెలికాఫ్టర్ లో ఉన్న ఇద్దరు పైలెట్లు కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ శ్రీ వాస్తవ తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుపోతుండగా చనిపోయారు..