20 లక్షల రూపాయల లంచంకేసులో పోలీస్ ఇన్స్పెక్టర్ మానసిని ఉద్యోగంనుంచి డిస్మిస్ చేశారు. మానసి ప్రస్తుతం విజిలెన్స్ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఒడిస్సాలోని సంబాల్ పూర్ లో ఆమె విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై విజిలెన్స్ కేసుఉంది.
ఈ కేసులో అతడికి అనుకూలంగా ఫైల్ క్లోజ్ చెయ్యాలంటే తనకు 20 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని ఆమె కండిషన్ పెట్టింది. ముందుగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని , చివరగా మరో 10 లక్షలు ఇవ్వాలని షరతు పెట్టింది.
10 లక్షల రూపాయల లంచం డబ్బులు , ఆమెకు ఏజెంట్ గా పనిచేసే సాహూ అనే వ్యక్తికీ ఇవ్వాలని చెప్పింది. సాహూ లంచం తీసుకుంటుండగా , ఎసిబి అధికారులు పట్టుకున్నారు. దీని ఆధారంగా , మానసిని అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్టై , జైల్లో ఉన్న మానసిని ఉద్యోగం నుంచి కూడా తొలగించారు..