సోషల్ మీడియాలో ఈరోజు ఒక వీడియో వైరల్ గా మారింది. గుంటూరు కలెక్టరేట్ కు వచ్చిన వెంకాయమ్మ అనే మహిళ సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ పాలన వద్దే వద్దు అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు లేక నారా లోకేష్ విజయం సాధించి అధికారంలోకి వస్తారని వెంకాయమ్మ చెబుతోంది.
జగన్ పాలన గురించి ఈ అక్క మాటలు వినండి.. pic.twitter.com/PL8sPfFcDw
— Telugu Desam Party (@JaiTDP) May 16, 2022
వైసీపీ ఓటమిపై పందెం కాస్తానని, తన ఎకరంన్నర పొలం పందెం కాసేందుకు సిద్ధమని చెబుతోంది. జగన్ పాలనలో ప్రజలు రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పింది.
ప్రజలు మెచ్చే విధంగా పాలించడం చేతకాని దద్దమ్మలే తమను విమర్శించేవారి నోరు నొక్కాలనుకుంటారు. జగన్ రెడ్డి పాలనను విమర్శించిన తాడికొండ మండలం కంతేరుకు చెందిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మ పై అర్థరాత్రి రౌడీలను పంపి దాడులు చేయించారంటే… పాలకుల్లో ఉన్న అసహనం, భయం తెలుస్తున్నాయి. pic.twitter.com/W9AyxAaUSM
— Telugu Desam Party (@JaiTDP) May 17, 2022
వెంకాయమ్మ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారడంతో.. నారా లోకేష్ ఆమెకు బాసటగా నిలిచారు.
వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతి ఇంటా వినిపిస్తుందని, వైఎస్ జగన్ పరిపాలనకు ఆమె మాటలు నిదర్శనమని నారా లోకేష్ అన్నారు.
వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్రపరిణామాలు తప్పవు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలు..మా దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులు.(2/3)
— Lokesh Nara (@naralokesh) May 17, 2022
వెంకాయమ్మకు గానీ, ఆమె కుటుంబసభ్యులకుగానీ ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు లోకేష్.