తగలబడి ఐదుగురిని బలి తీసుకుంది.

    0
    565

    చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతే పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి వంతెన గోడను ఢీ కొనడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. కారులోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. మృతులలో ఒక పసి బిడ్డకూడా ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.

     

    ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. మృతులంతా విజయనగరం జిల్లాకు చెందిన వారు. కారు వేగంగా పోతుండగా అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీ కొట్టడంతో , క్షణంలో మంటలు చెలరేగి కారు మొత్తం ఒక్క సారిగా అగ్నికీలల్లో చిక్కుకుంది. వంతెన గోడను ధీ కొట్టిన సమయంలో పెద్ద శబ్దం వినపడిందని చెప్పారు..

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.