ప్రభుత్వ అధికారులు రాజకీయనాయకుల చెప్పులు మోసేందుకే ఉన్నారని ,మాజీ ముఖ్యమంత్రి , సీనియర్ బీజేపీ నాయకురాలు ఉమా భారతి అన్నారు. అధికారులకు పనిచేసేందుకు ఏమీ ఉండదు.. మంత్రులు చెప్పాలి.. కీలక విషయాలన్నీ మంత్రులే నిర్ణయించి చెబితే అధికారులు ఫైల్స్ కదిలిస్తారు.. అంతే. ఒక రకంగా వాళ్ళు మా చెప్పులు మోసేందుకే ఉంటారు.. అంతే అంటూ ఆమె చెప్పిన అహంకారపు మాటలు సోషల్ మీడియాలో రావడంతో , గందరగోళం చెలరేగింది.. ఆమెపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెబుతూ , తాను అధికారుల గౌరవాన్ని పెంచేందుకే ఇలా మాట్లాడానని , దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నారు..
ఇవీ చదవండి..