హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో సంచలన నిజాలు తెలిసాయి. ఈ ప్రమాదంలో యు ట్యూబర్ , నటి గాయత్రీ , రోహిత్ అనే యువకుడు ప్రయాణిస్తున్న కారు గచ్చిబౌలి దగ్గర వేగంగా వచ్చి , రాజేశ్వరి అనే మహిళను ఢీకొని , ప్లాట్ ఫార్మ్ పై తిరగబడింది. రాజేశ్వరి అక్కడికక్కడే చనిపోగా , కారు నడిపే రోహిత్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉన్నాడు.
గాయత్రీ తీవ్ర గాయాలతో చనిపోయింది. ఈ ప్రమాదంలో విచారణకోసం కారులో తనికీ చేయగా , రెండు కొబ్బరి బొండాలు చిక్కాయి. ఆ కొబ్బరి బోండాల్లో మద్యం ఉంది. హోలీ సందర్భంగా రోహిత్ , గాయత్రీ పార్టీ చేసుకున్నారు. మొత్తం ఆరు కొబ్బరిబొండాల్లో మద్యం నింపుకున్నారు. నాలుగు కొబ్బరిబొండాల్లో మద్యం తాగేసి , రెండు కార్లోనే పెట్టేసారు.
ఇందుకోసం ఒక రోజుముందే మద్యం కొనిపెట్టుకున్నారు. హోలీ రోజు పబ్ కి వెళ్లిన వీరిద్దరూ , ఆ రోజు మద్యం కు అనుమతిలేకపోవడంవల్ల , ముందుగానే మద్యంకొని , పెట్టుకున్నారు. కొబ్బరిబొండాల్లో మద్యంనింపి , పబ్ కి తీసుకెళ్లారు. మద్యం మైకంలో అతివేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు..