కర్నాటకలోని బీదర్ స్టేషన్లో ఓ ట్రక్కును రైలు ఢీకొట్టింది. లెవల్ క్రాసింగ్ వద్ద ఆ ట్రక్.. స్పీడ్గా వస్తున్న ట్రైన్ను గమనించకుండా పట్టాల మీదకు వచ్చేసింది. డ్రైవర్ అప్రమత్తమయ్యే సమయానికే రైలు వేగంగా వచ్చి ట్రక్ ను ఢీకొంది. పరిస్థితిని గమనించిన ప్రజలు చెల్లాచెదరుగా పారిపోయారు.
ఆ తర్వాత కొద్దిదూరంలో రైలును డ్రైవర్ నిలిపివేశారు. ట్రక్ను ఢీ కొనకుండా ట్రైన్ డ్రైవర్ ప్రయత్నం చేశాడు. అయినా వీలు కాలేదు. ట్రక్ డ్రైవర్ ముందుగా దిగేసి పారిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ట్రక్ ధ్వంసమైంది. రైలులో ప్రయాణీకులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు.
#WATCH Bidar, Karnataka | A train collided with a truck at Bhalki crossing, early this morning. No injury reported pic.twitter.com/9xYUUZTpcy
— ANI (@ANI) July 7, 2022