పసిబిడ్డ సాక్షిగా ఎంత దారుణం చేశాడో..?

    0
    5254

    తిరుపతిలో భువనేశ్వరి అనే వివాహిత హత్యకేసులో , భర్త శ్రీకాంత్ రెడ్డి ఎంత దారుణం చేశాడో తెలిస్తే వళ్ళు జలదరిస్తుంది. కసాయి మనుషులు కూడా చేయలేనంత నీచంగా భార్యను చంపేశాడు. రెండేళ్ల బిడ్డ ముందు , భార్యను చంపడమే కాదు , ఆ బిడ్డ చూస్తుండగానే భార్య శవాన్ని సూట్ కేసులో కుక్కాడు.

    బిడ్డను తీసుకునే , ఆ సూట్ కేసును కారులో పెట్టాడు. తరువాత , ఆ సూట్ కేసును , రుయా ఆసుపత్రి వెనక్కి తీసుకెళ్లి , సూట్ కేసులోనుంచి శవం తీసి , బిడ్డను ఎత్తుకునే , భార్య శవంపై పెట్రోల్ పోసి కాల్చేశాడు..

     

    ఆమె తల్లి తండ్రులకేమో కరొనతో , హైదరాబాద్ లో చనిపోయిందని , శవాన్ని అక్కడే కాల్చేశారని చెప్పాడు. రెండేళ్ల క్రితమే ప్రేమించి పెళ్ళాడి , ఇలా కిరాతకంగా చంపేశాడు.. ఈ కిరాతకాలన్నీ లోకం తెలియని పసిబిడ్డ సాక్షిగా చేయడం మరో దారుణం.. ఇవన్నీ సిసి కెమెరాలో చూసిన పోలీసు పూర్తి సాక్ష్యాలతో కేసుపెట్టింది..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.