తిరుమలకు ఘాట్ రోడ్డు , కాలినడక సమయాల్లో మార్పులు చేశారు. గతంలో కాలినడక మార్గంలో పులులు సంచారం, కరోనా ప్రభావంతో అలిపిరి మెట్ల మార్గంలో భక్తులరాక పోకల విషయంలో మార్పులు చేశారు.. ఇప్పుడు వాటిని తిరిగి యధాస్థితికి తెచ్చారు. అలాగే తిరుమలకు వాహనాల్లో పోయే సమయాల్లో కూడా మార్పులు చేశారు.
తాజా నిబంధనల ప్రకారం ఉదయం 3 నుండి రాత్రి 12 గంటల వరకు ఫోర్ వీలర్స్ కు అనుమతి ఇస్తారు. ఉదయం 4 నుండి రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉంటుంది. ఉదయం 4 నుండి రాత్రి 10 గంటల వరకు అలిపిరి కాలినడక మార్గంలో భక్తులకు అనుమతి ఇచ్చారు. రాత్రి 12 నుండి ఉదయం 3 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్లు మూసివేస్తారు..