ఈ ఫొటో ఇప్పుడు ప్రపంచంలో ఒక ప్రత్యేకం.. పుట్టినగడ్డని, ఆస్తులను వదిలి , కట్టుబట్టలతో ఆఫ్గనిస్తాన్ నుంచి బెల్జియం గడ్డపై అడుగుపెట్టిన ఓ కుటుంబంలోని పాప , ఎయిర్ పోర్టులో ఎగిరిగంతులేసింది.. పుట్టిన గడ్డలో కసాయి పాలకుల తుపాకుల ,తూటాల పాలన నుంచి స్వేచ్ఛగా , స్వచ్ఛమైన జీవితానికి ఆ పాపకు స్వాగతం అంటూ ప్రపంచం నెట్లో ఆహ్వానించింది. కాబూల్ ఎయిర్ పోర్టులో ఇప్పటికీ వేలాదిమంది ఇతరదేశాల వలసపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. కడుపున పుట్టిన బిడ్డలనైనా కాపాడుకోవాలని , తమ బిడ్డలను ఇచ్చేసి తీసుకుపోండి అని దండం పెడుతున్నారు.. బహుశా ఇంత మానవ విషాదం ఎపుడూ లేదు..