మనిషికి నమ్మకంగా ఉండే నేస్తం శునకం. అన్నివేళలా కని పెట్టుకుని ఉంటుందీ మూగజీవం. తనతో 11 ఏళ్ళు సహవాసం చేసి చనిపోయిన కుక్కకి ఏకంగా పాలరాతితోనే విగ్రహం చేయించి పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు ఓ యజమాని. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.శివగంగ సమీపంలోని బ్రాహ్మణకురిచ్చిలో 82 ముత్తు అనే వ్యక్తి వద్ద ఓ కుక్క ఉండేది. లాబ్రడర్ జాతికి చెందిన ఈ కుక్కకి టామ్ అనే పేరు పెట్టుకుని ప్రేమగా చూసుకున్నాడు.
11 ఏళ్ళ పాటు ముత్తు వద్దనే ఉంటూ.. అతనితో మెలిగింది. గతేడాది ఈ కుక్క మరణించింది. అయినా సరే.. ముత్తు మాత్రం తను ప్రేమగా పెంచుకున్న శునకాన్ని మర్చిపోలేదు.తన వ్యవసాయ పొలంలో పాలరాతితో విగ్రహం తయారు చేయించాడు. రోజూ పూలమాల వేసి పూజ చేస్తాడు. ఆ కుక్కకి ఇష్టమైన ఆహారాన్ని ప్రతిరోజూ నైవేద్యంగా పెడుతుంటాడు. ఆ ఆహారాన్ని ఇతర కుక్కలకు వేస్తుంటాడు. ఏడాది కాలంగా ఆ వృద్దుడు ఆ కుక్క మీద ఉన్న ప్రేమను చాటుకుంటున్నాడు.