తెలంగాణ ముఖ్యమంత్రి సడన్ గా ఆస్పత్రిపాలయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ కు గుండె, యాంజియో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది. అస్వస్థత వల్ల ఈరోజు యాదాద్రి పర్యటనను కూడా సీఎం రద్దు చేసుకున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్ ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్ లో పెట్టిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
I wish CM KCRao speedy recovery and a long life.
He seems to have slipped and fell down this morning. I also hope his angiography result comes out normal.
Nobody's career should be cut short due to health issues… including those of politicians. pic.twitter.com/kHZ5vPpIyq
— Konda Vishweshwar Reddy (@KVishReddy) March 11, 2022
కేసీఆర్ ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని యశోద ఆస్పత్రి వైద్యుడు డా.ఎంవీ రావు తెలిపారు. ప్రాథమిక పరీక్షల అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు వెల్లడించారు. సాధారణ చెకప్లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
#kcr వైద్య పరీక్షలపై డాక్టర్ ఎం.వి.రావు. కేసీఆర్ కి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం.
రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు,నార్మల్ పరీక్షలు చేశాం.
ఎడమ చెయ్యి,ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు.
దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. pic.twitter.com/cBz7B26bRI— RameshVaitlaNTV #CrimeInside (@RameshVaitla) March 11, 2022