లాప్ టాప్ పేలుడులో గాయపడ్డ సుమలత చనిపోయింది. కడప జిల్లాలోని మేకలవారిపల్లి అనే గ్రామంలో ఇంటినుంచే సుమలత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉంది..సుమలత సోమవారం ఉదయం తన ఇంటినుంచే లాప్ టాప్ లో కంపెనీ అసైన్మెంట్ వర్క్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్తో ల్యాప్టాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆమె తన బెడ్ రూమ్ లో డబుల్ కాట్ పై పనిచేస్తోంది..
దీంతో మంటలు వచ్చి , పరుపు అంటుకుంది. మంటలు ఆమెను చుట్టుముట్టాయి.. ఆమె తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్ కి తరలించారు..చికిత్స తరువాత ఆమె ఈ రోజు చనిపోయింది. ఇప్పటిదాకా , మొబైల్ ఫోన్ లు, ఫోన్ ఛార్జర్లు పేలిపోవడం విన్నాం.. ఇటీవల ఎలెక్ట్రిక్ బైక్ పేలుళ్లు వింటున్నాం.. ఇప్పుడు తాజాగా లాప్ టాప్ పేలుడు సంచలనం అయింది.