హాస్టల్ లో భోజనం ఎలా ఉంటుంది. అద్భుతంగా అయితే ఉండదు కానీ.. కొన్ని సందర్భాల్లో పిల్లలకు ఆమోదయోగ్యంగానే ఉంటుంది. అయితే చాలాచోట్ల మాత్రం అస్సలు బాగోదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగనన్న గోరుముద్ద అనే పేరుతో ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు. మెనూ పర్ఫెక్ట్ గా అమలు చేస్తామంటన్నారు. అయితే వాస్తవానికి ఇది సరిగ్గా అమలవుతందా..? జగనన్న గోరు ముద్ద ఎలా ఉందో ఈ బాలిక మాటల్లోనే వినండి.
ఈరోజు కర్నూలు ఆదోనిలోని బాలికల పాఠశాలను ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కృష్ణమ్మ పరిశీలించారు భోజనం బాగోవటం లేదని నాసిరకం బియ్యం పెడుతున్నారని కోడి గుడ్లు కూడా సరిగా ఇవ్వడం లేదంటూ విద్యార్థులు వివరించారు pic.twitter.com/mStkU2Fnow
— I Love India✌ (@Iloveindia_007) November 29, 2021
కర్నూలు జిల్లా ఆదోనిలో బాలికల పాఠశాలను ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కృష్ణమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ బాలిక చెప్పిన సమాధానం ఇది. భోజనం బాగా లేదని, నాసిరకం బియ్యం వండుతున్నారని, కనీసం బియ్యాన్ని చెరగరని, కోడి గుడ్లు కూడా సరిగా ఇవ్వడం లేదంటూ విద్యార్థులు వివరించారు.