ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు సీతారామశాస్త్రి . మొదటి సినిమానే అతని ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. అంతేకాదు ఆ సినిమాకు గాను ఉత్తమ గేయ రచయితగా అవార్డుని అందుకున్నారు. అలా మొదలైన సీతారామశాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. 2019లో పద్మశ్రీ లభించింది. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
THE LEGEND IS NO MORE ?
REST IN PEACE #Seetharamasastry gaaru #RipSirivennellaSeetharamasastry gaaru pic.twitter.com/kyW5gipXTb
— thaman S (@MusicThaman) November 30, 2021