ఆకాశంలో ఉండగా ఈదురు గాలుల్లో చిక్కుకున్న స్పైస్ జెట్ విమాన ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు . వారిలో పది మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. అయినా వారికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు ప్రకటించారు . ఇదేదో సినిమా కథ కాదు . మన దేశంలోనే ఆదివారం జరిగిన ఓ విమాన ప్రమాదం . పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ లో ఈ ప్రమాదం జరిగింది . స్పైస్ జెట్ విమానం ఆకాశమార్గంలో ఉండగా తీవ్రమైన పెనుతుఫాను గాలుల్లో చిక్కుకున్నది .
దీంతో విమానం చిగురుటాకులా అటూ ఇటూ ఊగిపోయింది . ఈ ఉపద్రవం జరుగుతున్న తరుణంలో కేబిన్ లోఉన్న లగేజీలు ప్రయాణికుల మీద పడి 40 మంది గాయపడ్డారు . కొంతమంది విమానం ఆకాశమార్గంలో అటు ఇటు ఊగుతూ ఉండగా ,సీట్లు నుంచి విమానంలోనే కిందపడిపోయారు . భయంతో కేకలు పెట్టారు . దీంతో విమానం మొత్తం హాహాకారాలతో నిండిపోయింది . పైలెట్ విమానాన్ని ఎయిర్పోర్ట్లో దించేశారు .
విమానం దిగుతున్న సమయంలో కూడా విపరీతమైన గాలులకు ఊగిపోయింది ఈ ప్రమాదంపై విమానయాన సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ఈ విమానం ముంబై నుంచి దుర్గాపూర్ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపింది గాయపడ్డ ప్రయాణికులకు తక్షణమే చికిత్స అందించామని తెలిపింది. స్పైస్జెట్ ఎక్స్ప్రెస్ జరిగిన ప్రమాదానికి విచారం వ్యక్తం చేసింది . ప్రయాణికులకు అవసరమైన వైద్య సౌకర్యాలు కూడా తాము చేస్తామని పేర్కొంది.
Around twelve passengers were injured due to severe turbulence on a #SpiceJet Mumbai-Durgapur flight while it was descending for the destination airport.
Read more here: https://t.co/5tWstLuiFd pic.twitter.com/VysuYmuzEn
— Hindustan Times (@htTweets) May 2, 2022