మెగా స్టార్ చిరంజీవి సినీ లైఫ్ లో ఆచార్య సెట్ బ్యాక్ ఆయన కోలుకోలేనిదే.. ఎందుకంటే సినిమా కొన్నవాళ్ళు నెత్తిన గుడ్డేసుకునే పరిస్థితి.. ఆ సినిమాపై అంచనాలన్నీ తల్లకిందులు అయ్యాయి. చిరంజీవి , కొడుకు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇది మొదటి సినిమా.. బ్రహ్మాండంగా ఆడుతుందని , కోట్లు కురిపిస్తుందని , మురిసిపోయారు. అయితే ఈ సినిమాపై అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ అని ముందుగా చెప్పినప్పటికీ , సినిమా ఫ్లాప్ అన్న విషయం ఆ రోజే తేలిపోయింది.
మొదటి రోజు కలెక్షన్లు ప్రపంచవ్వాప్తంగా 42 కోట్లు గ్రాస్, 31. కోట్లు షేర్ సాంధించింది. కానీ రెండో రోజు మాత్రం వసూళ్లలో సినిమా ఢమాల్ అయింది. . రెండో రోజు ఏపీ , తెలంగాణ లో ఐదు కోట్ల , 15 లక్షల కోట్ల షేర్ని మాత్రమే రాబట్టింది రెండు రోజుల్లో ప్రపంచవ్వాప్తంగా 62.85 కోట్లు గ్రాస్, 41.07 కోట్లు షేర్ సంపాదించింది. మార్నింగ్ షో నుంచి నైట్ షో వరకు సినిమా హాల్ కి ప్రేక్షకులు ఎక్కలేదు.
సినీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఆచార్య సినిమా మొదటిరోజు 61.22 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. ఎలా ఉందొ చూడండి.. మార్నింగ్ షో.. 58.94, మధ్యాహ్నం షో .. 56.68 సాయంత్రం షో.. 62.02 రాత్రి షో : 67.22 మాత్రమే హాల్స్ నిండాయి.. సగటున మొదటిరోజు 61. 22 శాతం మంది మాత్రమే ఉంది . ప్రాంతాలవారీగా చూసుకుంటే విజయవాడ విశాఖపట్నం గుంటూరు కాకినాడ జిల్లాలలో మాత్రమే ఆక్యుపెన్సీ కొంచెం మెరుగు లో ఉంది .
మిగతా ఏరియాల్లో చాలా తక్కువగా ఉంది కలెక్షన్ల విషయంలో కూడా ఆచార్య సినిమా మొదటి రోజు 35 కోట్లు మాత్రమే ఇది ఇండియా స్థాయిలో కలెక్షన్ ఉంది. ఇది మరీ దారుణం. రామ్ చరణ్ కూడా నటించిన ఈ సినిమాలో పూజ హెగ్డే, సోనూసూద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు . ఈ సినిమా పరాజయం చిరుని , పాత్రల ఎంపికలో ఆలోచనలో పడేసింది.