కేసులు తగ్గిపోవాలంటో పోలీసుల వింత పూజలు..

    0
    204

    కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్‌స్టేషన్‌ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. స్టేషన్‌ కు ఇటీవల కాలంలో కేసులు ఎక్కువగా వస్తున్నాయని పోలీసులు శాంతి పూజలు నిర్వహించారు. స్థానికంగా ఇది కలకలం రేపింది. ఆదివారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులందరూ కలిసి అర్చకుల చేత విశేష పూజలు చేయించారు. ఈ పూజలు ఎందుకోసం అంటూ కొందరు పోలీసుల్ని ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్‌ కు వచ్చే కేసులను తగ్గించడానికి అంటూ పోలీసులు సమాధానం చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

    విశేష పూజల సందర్భంగా అర్చకులు ఎస్సైల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో గోమూత్రం చల్లారు. కొన్ని వారాలుగా కేసుల సంఖ్య పెరగడంతో పాటు డ్యూటీ చేస్తున్న ఓ కానిస్టేబుల్ పాముకాటుతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శాంతి పూజలు చేయిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని కొందరు చెప్పడంతో పోలీసులు స్టేషన్ ఆవరణలో గోమూత్రం చల్లించి శాంతి పూజలు జరిపించారు.

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..