హనీమూన్ ముగిసింది. అత్త అల్లుడితో పోయింది.

    0
    3548

    అక్ర‌మ సంబంధాల వ్యామోహాల్లో వావీవ‌ర‌స‌లు అదృశ్య‌మైపోతున్నాయి. నైతిక విలువ‌లు ప‌త‌న‌మైపోతున్నాయి. ఓ త‌ల్లి కూతురికి పెళ్ళి చేసి హనీమూన్ కి పంపించింది. పాపం కూతురు త‌ల్లిని హనీమూన్‌లో త‌న‌కు తోడు ర‌మ్మ‌ని కోరింది. రెండు నెల‌ల హ‌నీమూన్ ఆనందంగా ముగిసింది. ఇంటికి తిరిగి వ‌చ్చేట‌ప్ప‌టికీ కూతురు సంగ‌తి ఎలా ఉన్నా, త‌ల్లి వాంతులు చేసుకుంది. ఆమె గ‌ర్భ‌వ‌తి అని డాక్ట‌ర్లు తేల్చారు. దీంతో కూతురికి అనుమానం వ‌చ్చి త‌ల్లిని నిల‌దీసింది. హ‌నీమూన్‌లో అల్లుడితో తాను కూడా గ‌డిపాన‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది.

    భ‌ర్త కూడా తాను ఇష్ట‌మైతే ఇద్ద‌రితోనూ కాపురం చేస్తాన‌ని లేదంటే భార్య‌ను వెళ్ళిపొమ్మ‌ని చెప్పాడు. దీంతో అల్లుడికి అత్త కాస్తా పెళ్ళాం అయింది. త‌ల్లి చేసిన ప‌నికి కూతురు పాల్ వైట్ అలిగి వెళ్ళిపోయింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భ‌ర్త ఇంత ద్రోహం చేస్తాడ‌ని తాను ఊహించ‌లేద‌ని చెప్పింది. భ‌ర్త కంటే త‌న త‌ల్లి చేసిన ద్రోహం ఇంకా పెద్ద‌ద‌ని అందుకే ఆమె మొహం చూడ‌కూడ‌ద‌ని విడిగా వ‌చ్చేశాన‌ని చెప్పింది.

    ఇటీవ‌ల త‌న త‌ల్లి చేసిన ద్రోహాన్ని కూతురు పాల్ వైట్ ఓ టీవీ ఇంట‌ర్వూలో వివ‌రంగా చెప్పింది. త‌న మాజీ భ‌ర్త‌కు త‌ల్లి క‌న్న‌బిడ్డ‌ను ఇంత‌వ‌ర‌కు తాను చూడ‌లేద‌ని, అస‌లు త‌న త‌ల్లితో మాట్లాడ‌లేద‌ని తెలిపింది. బిడ్డ పుట్టిన త‌ర్వాత ఐదేళ్ళ త‌న త‌ల్లి త‌న మాజీ భ‌ర్త‌ను పెళ్ళి చేసుకుంద‌ని, ఇలంటి త‌ల్లులు ఎవ‌రికీ ఉండ‌కూడ‌ద‌ని కూడా పాల్ వైట్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్