ఆరుగురు బిడ్డలు ఉన్న ఓ తల్లి పద్నాలుగేళ్ళ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ళకు ఆ బాలుడిని లేవదీసుకుపోయింది. గుజరాత్ లోని దహోద్ జిల్లా సుక్షార్ లో ఈ నీచమైన ఘటనకు పాల్పడిన మహిళ వయసు 40 ఏళ్లు. భర్త ఆరుగురు బిడ్డలు ఉన్న ఈ మహిళ 14 ఏళ్ళ బాలుడితో ప్రేమలో పడిందట. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చయడంతో ఫోక్సో చట్టం కింద ఆ మహిళపై కేసు నమోదు చేశారు. ఆ మహిళ ఈ బాలుడిని గత ఆరు నెలలుగా లోబరుచుకుని ఇంటికి పిలిపిస్తోంది.
ఈ మహిళ పిల్లలతో స్నేహం వల్ల తమ బిడ్డ వాళ్ళ ఇంటికి వెళుతున్నాడని అనుకున్నామని, అయితే ఆమె ఇంతటి దారుణానికి పాల్పడుతుందని ఊహించలేదని ఆ బాలుడి తల్లిదండ్రులు అంటున్నారు. ఆ మహిళ భర్త మాత్రం ఆ బాలుడే తన భార్యను లోబరుచుకున్నాడని, తనను తన బిడ్డలను అనాధలను చేసి తీసుకెళ్ళిపోయాడని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. పోలీసుల విచారణలో వారిద్దరూ సంత్రాంపూర్ లో ఉన్నారని తెలిసి, అక్కడికి వెళ్ళి చూడగా… అప్పటికే వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.