ఆరుగురు బిడ్డలతల్లి.. 14 ఏళ్ళ బాలుడితో .

    0
    28400

    ఆరుగురు బిడ్డ‌లు ఉన్న ఓ త‌ల్లి ప‌ద్నాలుగేళ్ళ బాలుడితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ళ‌కు ఆ బాలుడిని లేవ‌దీసుకుపోయింది. గుజ‌రాత్ లోని ద‌హోద్ జిల్లా సుక్షార్ లో ఈ నీచ‌మైన ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన మ‌హిళ వ‌య‌సు 40 ఏళ్లు. భ‌ర్త ఆరుగురు బిడ్డ‌లు ఉన్న ఈ మ‌హిళ 14 ఏళ్ళ బాలుడితో ప్రేమ‌లో ప‌డింద‌ట‌. బాలుడి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చ‌య‌డంతో ఫోక్సో చ‌ట్టం కింద ఆ మ‌హిళ‌పై కేసు న‌మోదు చేశారు. ఆ మ‌హిళ ఈ బాలుడిని గ‌త ఆరు నెల‌లుగా లోబ‌రుచుకుని ఇంటికి పిలిపిస్తోంది.

    ఈ మ‌హిళ పిల్ల‌ల‌తో స్నేహం వ‌ల్ల త‌మ బిడ్డ వాళ్ళ ఇంటికి వెళుతున్నాడ‌ని అనుకున్నామ‌ని, అయితే ఆమె ఇంత‌టి దారుణానికి పాల్ప‌డుతుంద‌ని ఊహించ‌లేద‌ని ఆ బాలుడి త‌ల్లిదండ్రులు అంటున్నారు. ఆ మ‌హిళ భ‌ర్త మాత్రం ఆ బాలుడే త‌న భార్య‌ను లోబ‌రుచుకున్నాడ‌ని, త‌న‌ను త‌న బిడ్డ‌ల‌ను అనాధ‌ల‌ను చేసి తీసుకెళ్ళిపోయాడ‌ని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. పోలీసుల విచార‌ణ‌లో వారిద్ద‌రూ సంత్రాంపూర్ లో ఉన్నార‌ని తెలిసి, అక్క‌డికి వెళ్ళి చూడ‌గా… అప్ప‌టికే వారిద్ద‌రూ అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.