రోడ్డుమీద రెండు వాహనాలు ఢీ కొన్నట్టే సముద్రంలోనూ తరచుగా ఓడలు ఢీ కొంటాయి.. అంత పెద్ద ఓడలు ఢీ కొంటే నష్టంకూడా కోట్లలోనే ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్ కచ్ తీరంలో రెండు పెద్ద ఓడలు ఢీ కొన్నాయి. ఒక ఓడ రసాయనాలతో హాంగ్ కాంగ్ నుంచి వస్తోంది. మరో ఓడ మార్షల్ ఐలాండ్స్ నుంచి ఆయిల్స్ తో వస్తోంది. సముద్రంలో హాంగ్ కాంగ్ నుంచి వచ్చే ఓడ దిశ మారి , మార్షల్ ఐలాండ్స్ ఓడను ఢీకొనింది. దీంతో గుజరాత్ తీర రక్షణ దళం ఆప్రాంతానికి వెళ్ళింది. ప్రమాదానికి గురైన ఓడలనుంచి ఆయిల్ లీకై , సముద్రజలాల్లో , కాలుష్యం భయంతో , మరో ప్రత్యేక ఓడనుకూడా కోస్ట్ గార్డ్స్ తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు..