సమంతకు తీవ్ర అస్వస్థత నిజమేనా..?

    0
    7369

    సమంత ఆస్పత్రిలో చేరిందని, ఆమెకు వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉందని, జలుబు కూడా ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. ఇందలో కొంత నిజం ఉంది కానీ, అంతా నిజం కాదు. సమంతకు జలుబు, వైరల్ ఫీవర్ మాటలు వాస్తవమే కానీ ఆమె ఆస్పత్రిలో చేరలేదు. ఇటీవల తిరుమల యాత్ర అనంతరం కడప దర్గాకు వెళ్లిన సమంత, ఆ తర్వాత ఓ షోరూమ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. అనంతరం ఆమెకు దగ్గు, జలుబు రావడంతో హుటాహుటిన హైదరాబాద్ కి వచ్చింది. ఎంతకీ జలుబు తగ్గకపోవడంతో హైదరాబాద్ లోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స తీసుకంది. ఆస్పత్రికి ఔట్ పేషెంట్ గానే వెళ్లిన సమంత, పరీక్షలు, ట్రీట్ మెంట్ అనంతరం ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటోంది. అంతేకానీ ఆమెకు ఇబ్బందేమీ లేదని తెలిపారు ఆమె మేనేజర్ మహేంద్ర.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.