పసి పిల్లలతో బస్సుల్లో వెళ్తూ అవస్థలు పడే వారికోసం తెలంగాణ ఆర్టీసీ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బస్ స్టాండుల్లో పిల్లల్ని ఎత్తుకుని ఇబ్బందులు పడేవారికోసం చైల్డ్ ట్రావెల్ పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. పిల్లల్ని ఎత్తుకుని వెళ్లకుండా.. వాటిలో కూర్చోబెట్టి తీసుకెళ్లొచ్చు. దీనివల్ల చాలామంది తమకు సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండుల్లో ఈ సౌకర్ంయ అందుబాటులో ఉంది. త్వరలో మిగతా ప్రాంతాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తెస్తారు.
చంటి బిడ్డల తో #TSRTCBusStand కి వచ్చే ప్రయాణికుల కోసం ప్రయోగాత్మకంగా ఈ సదుపాయం ప్రవేశపెట్టాము. ప్రస్తుతం #MGBS మరియు #JBS లో అందుబాటులో ఉంది. త్వరలోనే అంతట విస్తరిస్తాము @TSRTCHQ #TSRTCAtService @baraju_SuperHit @ntdailyonline @iAbhinayD @rjshiv007 @dineshakula @News18Telugu pic.twitter.com/KuCEFtRFgL
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 10, 2022