ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ చిత్రం పలు భాషల్లో విడుదలవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.
మొన్నటికి మొన్న గుజరాత్లోని ‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’ దగ్గర ఈ ముగ్గరు సందడి చేశారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అక్కడ ఫోటోలు దిగారు. అటునుంచి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో పూజలు చేశారు.
ఈ త్రయం రోజుకో నగరం తిరుగుతూ భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. జైపూర్ లోని హవామహల్ వద్ద సందడి చేసిన ఈ RRR త్రయం… ఇప్పుడు కోల్ కత్తాలోని హౌరా బ్రిడ్జిపై మెరిసింది.
ఈ ముగ్గురి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.