సంచలనం సృష్టిస్తున్న ఆర్.ఆర్ సినిమా సగం మాత్రమే వేసి, సినిమా ఇంతేనని చెప్పేశారు. అదేదో ఇండియాలోనో , మన తెలుగు రాష్ట్రంలోనో , జరిగింది కాదు ఏకంగా అమెరికాలోని ఓ థియేటర్లో జరిగింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా సగం మాత్రమే వేసి తమకు ఇంతే వచ్చిందని సినిమా అంతా ఇంతేనని అనుకుంటున్నామని థియేటర్ మేనేజర్ చెబితే ఆశ్చర్యపోయారు.
ప్రముఖ సినీ విమర్శకులు అనుపమ మిశ్రా తన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అనుపమ చోప్రా నార్త్ హాలీవుడ్ , సినీ మార్క్ థియేటర్లో , ఆర్ ఆర్ ఆర్ సినిమాకు వెళ్ళారు. . .గంటన్నరకు సినిమా అయిపోయిందన్నారు. అదేంటని అడిగితే , తమదగ్గర అంతేవుందన్నారు. తమకు వచ్చింది ఇంతేనని తెలిపారు. దీంతో ప్రేక్షకులు బేజారైపోయారు.
1920లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత ఆధారంగా ఈ సినిమా తీశారు . మొదట ఈ సినిమా మూడు గంటల 56 నిమిషాల పాటు వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేసి 3 గంటలకు కుదించారు . అయితే నార్త్ సినిమా హాలీవుడ్ థియేటర్లలో ఈ సినిమా సగం మాత్రమే వేసి అయిపోయిందని మేనేజర్ చెప్పాడు.. మిగిలిన సినిమా ఏదని ప్రేక్షకులు అడిగితే అది రాలేదని , ఈ విషయంలో ఏమీ చేయలేనని సినిమా అయిపోయింది అంటూ ప్రేక్షకులను బయటికి పంపించేశారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రపంచంలోని అనేక దేశాలలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కి సానుకూలమైన వచ్చింది . సినిమా అనేక వర్గాల నుంచి ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.