నరేష్-పవిత్ర-రమ్య రఘుపతిల మద్య కొన్ని రోజులుగా వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. తన భర్తను తనకు కాకుండా చేస్తోందని పవిత్రపై రమ్య తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్, పవిత్రను పెళ్ళి చేసుకునేందుకు పాకులాడుతున్నాడంటూ ఆమె పలు చానల్స్ లో స్టేట్మెంట్ ఇవ్వడంతో… ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై పవిత్ర, నరేష్ లు తమ వాణీలు వినిపిస్తూ కౌంటర్ అటాక్లు కూడా చేశారు.
ఈ నేపధ్యంలో నరేష్, పవిత్రలో మైసూర్ వచ్చారు. ఓ హోటల్ వద్ద కనిపించిన వీరిని మీడియా కవరేజ్ చేయడంతో… రమ్య రఘుపతి సదరు హోటల్ వద్దకు చేరుకుంది. వారిని అక్కడ చూడగానే ఆగ్రహంతో ఆమె ఊగిపోయంది. ఉన్నట్టుండి పవిత్రపై రమ్య చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే నరేష్-పవిత్రలకు సెక్యూరిటీగా వచ్చిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.
ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె శాంతించలేదు. కాసేపటికి నరేష్-పవిత్రలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళే ముందు రమ్యను ఉడికించే ప్రయత్నం చేశాడు. ఈలలు వేస్తూ చేతులు ఊపుతూ రెచ్చగొట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్ళలో వైరల్ అయ్యాయి.