మన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల రేట్లు మళ్లీ పెరిగాయి .. గతేడాది వరకు అర్థం కాని ఛార్జీలతో వినియోగదారులను దోచేసిన విద్యుత్ శాఖ ఇప్పుడు మళ్లీ కరెంటు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది..
ఈ పెంచిన ఛార్జీలను విద్యుత్ నియంత్రణ మండలి ఆగస్టు నుంచి అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . 30 యూనిట్లవరకు 45 పైసలు , 31 నుంచి 75 యూనిట్లవరకు 91 పైసలు , 76 నుంచి 125 యూనిట్లవరకు ఒక రూపాయి 40 పైసలు, 126 నుంచి 225 యూనిట్లవరకు వరకు ఒక రూపాయి57 పైసలు, 226 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక రూపాయి 16 పైసలు , 400 యూనిట్లు దాటితే యూనిట్ కి 55 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించింది..