పెళ్లికూతురు గదిలో మద్యం సీసాలు కోసం..

    0
    916

    పెళ్లి బృందం ఒక గదిలో ఉన్నప్పుడు పోలీసులు ఒక్కసారిగా గదిలోకి చొరబడి సోదాలు చేయడం సంచలనమైంది. బీహార్ లో జరిగిన ఈ ఘటనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పోలీసులు పెళ్లికూతురు బస చేసిన గదిలోకిపోయి , బీరువాలు , సూట్ కేసుల్లో , బాత్ రూమ్స్ లో సోదాలు చేశారు. చివరకు , వాళ్ళు చెప్పిందేమిటంటే , పెళ్లికూతురు గదిలో మద్యం సీసాలు ఉన్నట్టు సమాచారం ఉందని , అందుకే తనిఖీలు చేశామని చెప్పారు.మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఈ వీడియో తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టి , ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని నిలదీసింది.. బీహార్ లో ఆటవిక పాలనకు ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేసింది.. మహిళలు ఉండే గదిలోకి సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించింది.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.