అవి హోటళ్లు కాదు, కానీ అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. హోటల్ లో ఇచ్చినట్టు రూమ్ అద్దెకివ్వరు, అలాగని మడతమంచాలు అద్దెకిచ్చే వ్యవహారం కూడా కాదు. కానీ దాదాపు అలాంటిదే. ఓ మంచం అద్దెకిస్తారు. అయితే దాని చుట్టూ ఓ సెటప్ ఉంటుంది. వీటిని పాడ్ రూమ్ లు అని పిలుస్తారు. విదేశాల్లో ఇలాంటివి బాగా ఫేమస్. ఇప్పుడు వీటిని భారతీయ రైల్వే స్టేషన్లలో కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
Sneak Peek!
Welcome to the new-age Pod retiring rooms by @RailMinIndia at Mumbai Central. pic.twitter.com/NR7OCsxYeg— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 17, 2021
ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లోని మొదటి అంతస్తులో 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూంను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో క్లాసిక్ పాడ్లు, ప్రైవేట్ పాడ్లు “లేడీస్-ఓన్లీ” పాడ్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పాడ్లు వంటి గదులు ఉన్నాయి. దీన్ని క్యాప్సూల్ హోటల్గా పిలిచే ఈ పాడ్ హోటల్లో ఒక్కో మంచంతో కూడిన చిన్న గదులు ఉంటాయి. ఈ మోడల్ జపాన్లో ఉద్భవించింది. ఇది కేవలం రాత్రి బస చేయడానికి లేదా చిన్న వ్యాపార పర్యటనలో అలసటతో నిద్రపోవడానికి బయట హోటల్కి వెళ్లడానికి విముఖత చూపే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ కాంపాక్ట్ వసతి పరిష్కారాన్ని అందించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో వీటి వీడియోని షేర్ చేశారు.