చూసేందుకు అమాయకంగా , అందంగా ఉంది.. అయితే అవినీతిలో మహా మాయ లేడి.. కరెన్సీ కంటికి కనిపించకపోతే ఏ ఫైలు మీదకూడా సంతకం పెట్టదు. డబ్బులేనిదే పనిచెయ్యనని తెగేసి చెప్పేస్తుంది.. అయితే పాపం పండి ఎసిబికి చిక్కింది. ఈమె కోరాపుట్ ప్రాంతంలోని దుదారి రెవెన్యూ ఆఫీసర్. జయరాం అనే పేద రైతుకు పంట వేసినట్టు ఒక అధికారపత్రం ఇచ్చేందుకు 10 వేలు డిమాండ్ చేసింది. ఇవ్వలేనని చెప్పడంతో , సర్టిఫికెట్ కూడా ఇవ్వలేనని చెప్పింది.. దీంతో జయరాం ఎసిబి ని ఆశ్రయించాడు.. అధికారులు జయరాం కి 10 వేలు ఇచ్చి , పకడ్బందీగా అవినీతి అందాల రాణిని పట్టేశారు.. ఇంట్లో సోదాలు చేసిన వారికి తలతిరిగిపోయింది.. అమ్మడు ఉద్యోగంలో చేరిన ఐదేళ్లకే 10 కోట్లకు పైగా సంపాదించేసింది.. ఇప్పుడు ఆమె ఆస్తులు లెక్కించే పనిలో పడ్డారు..