వరద బాధితుల పరామర్శ లో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో జేబు దొంగల జోరు కూడా ఎక్కువైంది. మొబైల్ ఫోన్లు , డబ్బులు మాయమైపోతున్నాయి. ఒక పక్క వరదబాధితుల గోడు , మరోవైపు జేబుదొంగల చేతివాటానికి బలైపోయిన టిడిపి నేతల బాధతో విచిత్రమైన పరిస్థితి నెలకొనింది. ఇప్పుడు ఏకంగా మాజీమంత్రి జేబునే కొట్టేసారు.
మాజీ మంత్రి. రాజోలు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యారావు పర్స్ కొట్టేసిన జేబు దొంగలుపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనజేబులో 32,000 నగదు,17,000 విదేశీ కరెన్సు పోయినట్లు రాజోలు పిఎస్ లో గొల్లపల్లి సూర్యారావు. ఫిర్యాదుచేశారు. ఈయనతో పాటు మరొక 30 మంది నాయకుల పర్సలు పోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..