మంత్రిని ఇలా పట్టేసి , అలా కోట్లు కొట్టేసి..

    0
    564

    ఆమె మంత్రిగారి ఉంపుడుగత్తె.. గతంలో నాటకాల రాణి.. డాన్సర్. అంతేకాదు ఫేస్ బుక్ లో పెద్ద ఫేమస్ .. సోషల్ మీడియా పరిచయంతో అర్పిత , మంత్రి ఛటర్జీకి దగ్గరైంది. తరువాత మంత్రి పక్కనే సభలలో కనిపించేది. ఆ తరువాత మంత్రి ఛటర్జీనే , ఆమె ఇంట్లో కనిపించడం మొదలైంది. అంతే , ఇక మంత్రి ఇంటికన్నా , ఆమె ఇంటికే సందర్శకుల తాకిడి మొదలైంది. ఆ విధంగా అర్పిత , ఏస్థాయికి ఎదిగిందీ అంటే , ఏకంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ , ఆమెను పొగిడేంత స్థాయికి ఎదిగింది.

     

    బెంగాలీ, ఒడియా, తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ ఆమె నటించారు. బెంగాలీలో ఒకటి రెండు పెద్ద చిత్రాల్లోనూ ఆమె కనిపించారు. ఆమె ఫేస్‌బుక్‌ బయోలో మల్టీ టాలెంటెడ్‌ అని ఉంది. పార్థా ఛటర్జీ నిర్వహించే దుర్గా పూజల కమిటీ ‘నాట్కల ఉదయన్‌ సంఘ’కు ఆమె ప్రచారకర్తగానూ వ్యవహరించారు. కోల్‌కతాలో భారీగా దుర్గా పూజలు నిర్వహించే కమిటీ ఇది. ఇప్పుడు అర్పిత ఇంట్లో బస్తాల్లో పట్టక , గదిలో పోగేసిన నోట్లకట్టలు 20 కోట్లు కనిపించడంతో సంచలనమైంది..

     

    మంత్రి సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ నిర్వహించిన సోదాల్లో ఏకంగా రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ , ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో అవకతవకలకు సంబంధించిన మోసం కేసులో ఈడీ అధికారులు అర్పిత ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా పట్టుబడిన సొమ్మును ఎస్ఎస్‌సీ కుంభకోణంలో కూడబెట్టినదిగా అనుమానిస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.పట్టుబడిన సొమ్మును లెక్కించేందుకు బ్యాంకు అధికారుల సాయం తీసుకున్నామని, క్యాష్ కౌంటింగ్ మెషీన్లను ఉపయోగించి నోట్లను లెక్కించినట్టు చెప్పారు. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల నివాసాలపైనా ఈడీ దాడులు నిర్వహించింది.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.