చాలా కాలం విరామం తర్వాత పవన్ కల్యాణ్ ఏపీలో అడుగు పెట్టారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అంతరం కరోనా సోకడంతో ఆయన హైదరాబాద్ లోనే క్వారంటైన్లో ఉంటూ వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడా పబ్లిక్ ఫంక్షన్లకు కానీ, ప్రైవేటు కార్యక్రమాలకు కానీ హాజరు కాలేదు. రాష్ట్ర రాజకీయాలకు కూడా ఆయన కాస్త విరామం ఇచ్చారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన మీటింగ్ లో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు.
గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. అక్కడనుండి నేరుగా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం వెళ్లనున్నారు. pic.twitter.com/fGXCuGMwkL
— JanaSena Party (@JanaSenaParty) July 7, 2021