పవన్ కళ్యాణ్ రేపు ఏమి మాట్లాడబోతున్నాడు.. ? ఏవైనా సంచలన ప్రకటనలు చేస్తాడా..? తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికలు గురించి మాట్లాడుతాడా..? తనపై ఇంతకాలం వచ్చిన , వస్తున్న ఆరోపణలకు , విమర్శలకు సమాధానం చెప్పబోతాడా..? భీమ్లానాయక్ సినిమాకోసమే ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చి , ఆ తరువాత వాటిని వెనక్కి తీసుకోవడంపై విమర్శలు సాధిస్తాడా..? ఇన్ని అనుమానాలు ఎందుకంటే , సాక్షాత్తు పవన్ కల్యాణే , సోమవారం మంగళగిరిలో జరిగే జనసేన ఆవిర్భవ సభలో , అన్నింటికి సమాదానాలు చెప్తామని చెప్పేశాడు. రెండున్నరేళ్ల వైసిపి పాలనపై చురకలు వేయనున్నారు. పోలీసులు ఎవరూ తమకార్యకర్తలెవరిని , సభకు రాకుండా అడ్డుకోవద్దని పవన్ కళ్యాణ్ కోరారు. సభలకు రావడం వాళ్ళ హక్కు అన్నారు. కార్యకర్తలు కూడా , జాగ్రతగా సభకు రావాలని , ఎక్కడా అత్యుత్సాహంతో ప్రమాదాలు కొనితెచ్చికోవద్దని అన్నారు..