కారు ఫైనాన్స్ లో తీసుకున్నాడు.. వాయిదాలు కట్టలేదు.. ఎన్నిసార్లు చెప్పినా స్పందించకపోవడంతో కారు ఫైనాన్స్ రికవరీ సిబ్బంది వచ్చి కారు సీజ్ చేశారు.. తరువాత వీడేమి చేసాడో చూడండి.. మధ్యప్రదేశ్ కు చెందిన సునీల్ కుమార్ , మహేంద్ర క్వంటో కారు , ఫైనాన్స్ లో లోన్ తీసుకుని కొన్నాడు. ఏడు వాయిదాలు కట్టలేదు. రికవరీ సిబ్బంది వచ్చి కారు సెజ్ చేసి , తమ వెంట తెచ్చుకున్న క్రేన్ సాయంతో , కారు తీసుకుపోతుండగా , వీడు అడ్డుకున్నాడు.. దీన్ని రికవరీ స్టాఫ్ వీడియో తీస్తుండగా , అప్పటికే తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ కారులో పోసి , అగ్గిపుల్ల గీసి , తగలబెట్టేసాడు. కారు బూడిదైంది.. పోలీసులు సునీల్ ని అరెస్ట్ చేశారు..