బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షిసిన్హా పై , నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఒక చీటింగ్ కేసుకు సంబందించిన మూడేళ్ళ క్రితం ఆమెపై , ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో , ఒక కేసు దాఖలైంది. అప్పటినించి కేసు విచారణకు ఆమె హాజరు కాలేదు. దీంతో మొరాదాబాద్ కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
25 వ తేదీలోగా , కోర్టు ముందు లొంగకపోతే , ఆమెను అరెస్ట్ చేసి , కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశాలిచ్చారు. ఒక కార్యక్రమానికి సంబంధించి , దానిలో పాల్గొంటానని చెప్పి , 27 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంది. ప్రోగ్రాం కి రాకపోగా , అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేదు. దీనితో ప్రమోద్ కుమార్ అనే ఈవెంట్ మేనేజర్ సోనాక్షిసిన్హా పై చీటింగ్ , నమ్మకద్రోహం కింద కేసు పెట్టారు..