నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రారెడ్డి నగర్ వద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ఆత్మకూరు నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా కొట్టి పొలాల్లో పడిపోయింది.